అమరావతి పాదయాత్ర నాలుగో రోజు

అమరావతి:  మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించానే డిమాండ్ తో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్రకు నేడు నాలుగో రోజు.  న్యాయస్థానం నుంచి దేవస్థానం నినాదం తో  ఈ యాత్ర నేడు దీపావళి రోజు కూడా కొనసాగు తున్నది. ఈ  రోజు  గుంటూరు జిల్లా పుల్లడిగుంట నుంచి ప్రత్తిపాడు వరకు పాదయాత్ర సాగుతుంది. నేడు సుమారు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
మూడు రాజధానులు ప్రతిపాదన విరమించుకోవాలని ,  పోరాటం చేస్తున్న రైతులకు నిన్న గుంటూరు నగరవాసుల నుంచి అపూర్వ మద్దతు లభించినది.
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించే లక్ష్యంగా మహాపాదయాత్ర ముందుకు సాగుతున్నది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *