సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్ స్థాయి డయాగ్నస్టిక్ కేంద్రం

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను, ఆర్టీ పీసీఆర్ ను  ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ కొద్ది సేపటి కిందట ప్రారంభించారు.

ఈ తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రంలో ప్రజలకు 57 రకాల పరీక్ష లు ఉచితంగా చేస్తారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు , ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో కి తీసుకురావడం ఈ కేంద్రం ఉద్దేశమని హరీష్ రావు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చెప్పారు.

రాష్ట్రంలో మొత్తంగా 19 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఆయా జిల్లాల్లో అందుబాటులో కి వచ్చాయని మరో 16 కేంద్రాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.

ఇందులో కిడ్నీ, లివర్, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, సంగారెడ్డి జిల్లా లోని 25 పీహెచ్సీ, యూహెచ్ సీల నుండి సేకరించే రక్త నమూనాలనే ఇక్కడ పరీక్ష చేస్తారని ఆయన చెప్పారు.

“24 గంటల్లోనే పరీక్ష ఫలితాలు సెల్ ఫోన్లకు ఎస్.ఎం.ఎస్ రూపంలో‌ వస్తాయి. 550 కోట్లతో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాల ఏర్పాటవుతున్నది. రు. 260‌కోట్లతో 650 పడకలతో ఆధునాతన సౌరక్యాలతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తాం. సంగారెడ్డి జిల్లా ప్రజలకు త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులో కి రానున్నాయి. రెండు కోట్ల యాభైలక్షలతో కొత్త సీటీ‌స్కాన్ యంత్రం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోకి తెస్తాం,’ అని హరీష్ రావు తెలిపారు.

ఇలాగే పలు జిల్లాలలో డయాగ్నోస్టిక్ కేంద్రాలను మంత్రలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *