బాలయ్య మృతికి ఎఫ్డీసీ చైర్మన్ సంతాపం

అమరావతి,9 ఎప్రిల్:ప్రముఖ నటుడు బాలయ్య మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ,నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ ప్రగఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా,కథా రచయితగా ఎంతో ఉత్తమ ప్రతిభ చూపిన బాలయ్య పుట్టినరోజు నాడే చనిపోవటం బాధాకరమైన విషయమని ఆయన అన్నారు.

సినీ రంగంలో ఒక విలక్షణమైన వ్యక్తని విజయచందర్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చెల్లెలి కాపురం’ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి నంది పురస్కారాన్ని బాలయ్యకు బహుకరించిందని విజయ్ చందర్ గుర్తు చేసారు. బాలయ్య కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *