మోదీ వారణాసిలో కెసిఆర్ ఫ్లెక్జీలు

తెలంగాణని ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి తీసుకుపోతావుంటే, ఆయన అభిమానులను కెసిఆర్ ఫ్లెక్సీలను  ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గానికి తీసుకువచ్చారు.

దేశ్ కి నేతా కేసీఆర్ అని నినాదాలతో కాశీనగరంలో కెసిఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అక్కడి ఓటర్లకు కెసిఆర్ తెలంగాణ నేత మాత్రమే కాదు, కాబోయే ‘దేశ్ కి నేతా’ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

KCR Flex Boards in Varanasi

ఈ ఫ్లెక్సీలలో కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల నేతల ఫోటోలున్నాయి.  ఈ పార్టీలను కూడగట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని,  ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్రంటు కట్టి నాయకత్వం వహిస్తున్నారని ఈ బోర్డులను చూస్తే అనిపిస్తుంది. ఇందులో దేశ్ కి నేతా కెసిఆర్ అని హిందీలో రాసి ఉంది.

అభిమాని తెలంగాణ సాయి  ఈ బోర్డులను తగిలించారు.

కెసిఆర్ ప్రధాని రేస్ లో ఉన్నారనే ధ్వని ఈ ఫ్లెక్సీలలో కనిపిస్తుంది. ఇలా తెలంగాణ బిడ్డ మరొక సారి దేశ్ కీ నేత  కాబోతున్నాడనే పులకింత రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది.

టిఆర్ ఎస్ ,కెసిఆర్ ఫ్లెక్స్ బోర్డులు వారణాసిలో కనిపించడం కొంచెం వింతగానే ఉంది.  ఎవరో ఫోటో కూడా తీసుకుంటున్నారు.

 

అఖిలేష్ యాదవ్ కు ఎన్నికల్లో మద్దతునీయలేదు గాని, అఖిలేష్ ను కెసిఆర్ తన కూటమిలో చేర్చుకున్నారు. ఇలా యూపి ప్రజలకు తనని పరిచయం చేసుకున్నారు. మరొక వైపు శివాజీ విగ్రహావిష్కణలతో మరాఠాలకు దగ్గిరయ్యే ప్రయత్నం సాగుతూ ఉంది. మొత్తానికి కెసిఆర్ దేశ్ కి నేత క్యాంపెయిన్ ని అభిమానులు జోరుగా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *