చెడ్డి గ్యాంగ్ కథేంటో తెలుసా? పోలీసుల ప్రకటన

పోలీస్ కమీషనర్ కార్యాలయము, విజయవాడ సిటీ పత్రికా ప్రకటన
విజయవాడ నగర ప్రజలను బయబ్రాంతులకు గురి చేసి వివిధ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు అరెస్ట్
ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు మరియు అనుమానాస్పద వ్యక్తులు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తుల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విజయవడ నగర పోలీస్ కమీషనర్ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ మరియు పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు వెంనే అప్రమత్తమై ఘటనా స్థలాలకి చేరుకొని నేరం జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన ఆధారాలు మరియు సి.సి. కెమెరాల ఆధారంగా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ ముద్దాయిల గురించి గాలించుచుండగా పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు టూటౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీ మోహన్ రెడ్డి గారు, పెనమలూరు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సి.సి.ఎస్. సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిందితుడి వివరాలు:
1) మడియా కాంజీ మేడా, తండ్రి కాంజీ మేడా, వయస్సు(30సం||), కులం: మేడా, గుల్చర్ గ్రామం, గార్బార్డ్ తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం.
2) సక్ర మండోడ్, తండ్రి తెజియ మండోడ్, మయస్సు (45 సం||), కులం: మండోడ్, ఖతియా ఫాలియ స్ట్రీట్, గుల్బర్ గ్రామం, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం.*
3) కమలేష్ బాబేరియా @ కమలేష్ @ కమ్లా, తండ్రి బబ్లా కలియా, వయస్సు 27 సం||) కులం: బాబేరియా, ఝుబువా తాలుకా, జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం.
నేరం జరిగిన విధానం:
విచారణలో… పై నిందితులు గుల్ఫర్ గ్రామం గార్బార్డ్ తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రమునకు మరియు ఝుబువా తాలూకా, జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రలకు చెందిన వారు, వీరు నేరానికి వచ్చేటప్పుడు నిక్కరు దరిస్తారు కాబట్టి వీరిని చెడ్డీ గ్యాంగ్ అని పిలవబడుతున్నారు.వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్ళలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నగర శివారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్ మెంట్ లను పగడి సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళుతూ ఉంటారు.
గత నవంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం నుండి రైలులో బయలుదేరి విజయవాడ నగర శివారులోని మిల్క్ ప్రాజెక్టు వద్ద గల ఫ్లైవోవర్ బ్రిడ్జి పక్కన ఉన్న అపార్ట్ మెంట్ ను గమనించి ఆ అపార్ట్ మెంట్ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండడంవల్ల దొంగతనం చేయడానికి అనువైనదిగా ఎంచుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించుకుని దొంగతనం చేయాలని నిర్ధారించుకున్నారు.
అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ముందుగా వారు రెక్కీ చేసిన అపార్ట్ మెంట్ సమీపంలో వీరు దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి చేయడానికి అనువుగా ఒక ఇనుప రాడ్డు మరియు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఆ అపార్ట్ మెంట్ దగ్గరలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ సమయంలో కొసం ఎదురు చూస్తూ ఉండి రాత్రి సుమారు 2.00 గంటల సమయంలో (తెల్లవారితే 29వ తేదీ) పై నిందితులలో మొదటి నిందితుడు మడియా మరియు మరో నలుగురు వ్యక్తులు ప్యాంటు, చొక్కాలను విప్పేసి కేవలం బన్నీలు, చెడ్డీలు వేసుకొని ముఖాలకు మరియు నడుముకు టవల్లు కట్టుకొని అపార్ట్ మెంట్ వెనక నుండి లోపలికి ప్రవేశించిన సమయంలో అక్కడ ఉన్న వాచ్ మెన్ ని మారణాయుధాలతో బెదిరించి, వారు తెచ్చిన మారణాయుధాలతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా తెరిచి అందులో ఉన్న బంగారు వస్తువులు, డబ్బులను దొంగతనం చేసి తిరిగి వారి స్థావరాలకు వెళ్ళిపోయారు.
Cheddi Gang
Cheddi Gang వివరాలు వెళ్లడిస్తున్న కమిషనర్
Cheddi Gang
Cheddi Gang నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు
అదే విధంగా ది.01.12.2021వ తేదీన హైదరాబాద్ రోడ్డులో గల ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో గల అపార్ట్ మెంట్ లను రెక్కీ నిర్వహించుకొని అదే రోజు రాత్రి సుమరాఠీ 7 గంటల సమయంలో మారణాయుధాలతో నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకొని సమయం కోసం ఎదురు చూసి రాత్రి 2 గంటల సమయంలో (తెల్లవారితే 2వ తేదీ) వారు ప్యాంటు చొక్కాలు విప్పేసి కేవలం బన్నీలు చెడ్డీలు వేసుకొని నడుముకు టవళ్ళు కట్టుకొని ఎవరికీ కనబడకుండా అపార్ట్ మెంట్ లోకి వెళ్ళినారు, అక్కడ వారు తెచ్చుకున్న మారణాయుధాలతో ఇంటి తలుపులు పగలగొడుతూ ఉండగా ఆ శబ్దానికి ఆ ఇంటిలోని వారు మరియు చుట్టు ప్రక్కల వారు లెగవడంతో వారు అక్కడి నుండి పారిపోయారు.
ఆ తర్వాత మరలా  02.12.2021వ తేదీన ఉదయం 9 గంటలకు గుంటూరు జిల్లా, తాడేపల్లి వెళ్ళి ఆ ఏరియాలో దొంగతనం చేయడానికి వీలుగా ఉంటుందని అనుకొని తాళాలు వేసిన ఇళ్ళను రెక్కీ నిర్వహించుకొని అక్కడి నుండి వచ్చేసి తిరిగి రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో దొంగతనం చేయడానికి తాడేపల్లిలో ఉన్న రైన్ బో విల్లాస్ ఉన్న కాలనీ వెనుక ఉన్న అరటి తోటలోకి వెళ్ళి ఎవరికి కనబడకుండా కూర్చొని సమయం కోసం ఎదురుచూసి రాత్రి సుమారు 1.00 గంటల సమయంలో (తెల్లవారితే 3వ తేదీ) వారు బట్టలు విడిచేసి, చెడ్డీలు, బన్నీలతో వారు తెచ్చుకున్న మారణాయుధాలతో కాలనీ వెనుక నుండి లోపలికి ప్రవేశించి అక్కడ తాళం వేసి ఉన్న 3 ఇళ్ళను పగలకొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.
కానీ అక్కడ ఎటువంటి బంగారం ఆభరణాలు గాని, నగదు గాని దొరకకపోవడంతో తరిగి వెళ్ళిపోయినారు. ఆరోజు రాత్రి అనగా తెల్లవారితే 4వ తేదీన ఆ విల్లాస్ కి దగ్గరగా ఉన్న కుంచనపల్లి గ్రామములో ఒక అపార్ట్ మెంట్ లో తాళాలు పగులగొట్టి నగదు మరియు ఇతర ఆభరణాలు దొంగిలించారు.
అదేవిధంగా పోరంకి నందు గల కాలనీలో రెక్కీ నిర్వహించుకొని  06.12.2021వ తేదీన రాత్రి సుమారు 8 గంటల సమయంలో నిడమానూరు వైపు వెళ్లే రోడ్డులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ వెనక ఉన్న పోలాలలో ఎవరికీ కనబడకుండా కూర్చోని రాత్రి సుమారు 2 గంటల సమయంలో (తెల్లవారితే 7వ తేదీ) వారు బట్టలు మార్చుకుని వారు తెచ్చుకున్న మారణాయుధాలతో విల్లాస్ ఉన్న కాలనీలోకి గోడదూకి కాలనీలోకి వెళ్ళి తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, వెండి వస్తువులు మరియు డబ్బులు దొంగిలించుకుని వెళ్ళినారు.
నేరం చేధించిన విధానం:
ఆధారాలు, విజయవాడ నగరంలోని టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు నగర పోలీస్ కమీషనర్ గారి ఆధ్వర్యంలో సి.సి.ఎస్., మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని నేరం జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన సైంటిఫిక్ గా సేకరించిన ఆధారాలు మరియు సి.సి. కెమెరాల ఆధారాంగా అన్ని కోణాలలో దర్యాప్తు చేసి అనంతరం పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలు మేరకు సి.సి. ఎస్. మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు టూటౌన్, పెనమలూరు ఇన్ స్పెక్టర్లు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యలో 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పోలీస్ వారికి రాబడిన సమాచారం పై ముద్దాయిలను ఆరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పై నేరాలను వీరు రెండు గ్యాంగ్ లుగా విడిపోయి నేరాలకు పాల్పడినారు. వారిలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది.
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు:
1) రూ. 20,000/-లు నగదు*
2) 32 గ్రాముల బంగారం*
3) 2.5 కేజీల వెండి*
పై కేసులలో దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., గారు అభినందించడం జరిగింది.

(ప్రెస్ నోట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *