రెండో రోజు అమరావతి పాదయాత్ర మొదలు

న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అనే నినాదంతో అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అక్కడి  రైతులు చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజున కొద్ది సేపటి కిందట మొదలయింది.  తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహా పాదయాత్ర ఇది.. సోమవారం ఉదయం తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

యాత్ర తొలి రోజున తుళ్ళూరు -పెదపెరిమి దారిలో

ఈ రోజు తాడికొండ నుంచి గుంటూరులోని అమరావతి రోడ్డు వరకు 13 కిలోమీటర్ల మేర పాదయత్ర చేయనున్నారు.  గుంటూరులోని గోరంట్లలో రెండోరోజు మహాపాదయాత్ర ముగియనుంది.

అమరావతి రైతుల తిరుపతి పాదయాత్ర తొలిరోజు…

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ లాంగ్‌ మార్చ్‌కి దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. 45 రోజుల పాటు ఈ మహాపాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా యాత్ర సాగుతుంది.

అమరావతి రైతుల పాదయాత్ర తుళ్ళూరు నుండి పెదపెరిమి దారిలో

తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేశారు.  పాదయాత్రకు వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి  మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *