కెసీఆర్ తరఫున మహిళా నేతల నామినేషన్ దాఖలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పేరును ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో పలువురు మహిళా నేతలు  నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత, ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు శ్రీమతి రేఖా నాయక్, శ్రీమతి హరిప్రియ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, పార్టీ ఇతర మహిళా నేతలు నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం వారంతా  పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు  కేటీఆర్ని కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *