రేపు ఇడుపులపాయ వస్తున్న షర్మిల

 

రేపు ఉదయం వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ రానున్నారు..

వైఎస్సార్ టీపీ అధికార ప్రకటన చేసి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 20 తేదీన చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు..

ఈ నేపథ్యంలో రేపు ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు..

షర్మిలమ్మ తో పాటు తల్లి విజయమ్మ ఇడుపులపాయకు రానున్నారు..

రేపు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు.. రోడ్డు మార్గంలో ఇడుపులపాయ చేరుకుంటారు.. సమాధివద్ద నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్ హౌస్ లో బస చేస్తారు..

సాయంత్రం తిరిగి ఇడుపులపాయ నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకొని విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *