మరొక తెలంగాణ గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్యా యత్నం

తెలంగాణలో మరొక గెస్టు లెక్చరర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. గెస్టు లెక్చరర్స్ జీతాలు లేవు , ఉద్యోగం రిన్యూ కావడం లేదు. దీనితో ఆర్థిక సమస్యల్లో పడ్డారు. అప్పుల భారం పెరిగింది. కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి.ఈ  ప్రాబ్లమ్స్ తో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. ఈ రోజు అచ్చంపేట తాలూకా కొండనాగుల జూనియర్ కళాశాలలో కామర్స్ గెస్టు లెక్చరర్ శ్రీనివాస్ ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకోవాలనుకున్నారు. ఆయన  పరిస్థితి సీరియస్  గా ఉందని సమాచారం. ప్రస్తుతం   అచ్చంపేట ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ జరుగుతున్నది. అయితే,  హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లు చెప్పారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/uncategorized/guest-lecturer-in-telangana-colleges/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *