షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష వాయిదా

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌భుత్వం రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఈ మంగ‌ళ‌వారం (28-09-2021) నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జ‌ర‌గాల్సిన వైస్సార్ తెలంగాణ నాయకురాలు షర్మిల  నిరుద్యోగ నిరాహార దీక్ష‌ను వాయిదా వేయ‌డం జ‌రిగింది.

తిరిగి వ‌చ్చే మంగ‌ళ‌వారం (05-10-2021) నాడు ఇదే ప్రాంతంలో నిరుద్యోగ నిరాహార దీక్ష‌ను చేప‌ట్ట‌నున్నారు. ద‌య‌చేసి YSR తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, నిరుద్యోగులు గ‌మ‌నించి.. స‌హ‌క‌రించ‌గ‌ల‌ర‌ని మ‌న‌వి.

*రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ముంపు ప్రాంతాల్లో బాధితుల‌కు అండ‌గా YSR తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నిల‌వాల‌ని, స‌హాయ కార్య‌క్ర‌మాల్లో విరివిగా పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *