సీనియర్ జర్నలిస్ట్ జలదంకి ప్రభాకర్ మృతి

కరోన మహమ్మారి మరో జర్నలిస్ట్ బలయ్యారు. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ వస్తున్న  జలదంకి ప్రభాకర్ (70) గత రెండు వారాలుగా కరోనా తో నెల్లూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి పరమపదించారు. వీరికి భార్య, ముగ్గురు కుమార్తెలు..

ఆంధ్ర పత్రిక లో దశాబ్దం కాలం పాటు నెల్లూరు లో పనిచేశారు. ఆంధ్ర పత్రిక మూతపడిన తర్వాత ‘నది’ మాస పత్రిక కు సంపాధకుని గా హైదరాబాద్, విజయవాడలో పనిచేశారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లా కావలి లో ‘స్వతంత్ర ప్రభ’ అనేపేరుతో దినపత్రిక ను పెట్టి నడుపుతూ ఉన్నారు.జలదంకి అకాల మరణం ఎంతో బాధాకరమని
నిమ్మరాజు చలపతిరావు,
అధ్యక్షులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *