రేవంత్ దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష

ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష చేపడుతున్నారు.   ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దీక్షలో ఉంటారు.

మొదట షామిర్ పేట్  కట్ట మైసమ్మ కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మూడు చింతలపల్లికి  రేవంత్ రెడ్డి చేరుకుంటారు.

మూడు చింతలపల్లిలో రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేత్కర్ విగ్రహానికి, మాజీ సమితి అధ్యక్షులు వీరారెడ్డి ల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు.

అక్కడ నుంచి భారీ ప్రదర్శనగా దీక్షా సభా స్థలికి చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దీక్ష లో  రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *