తెలుగు సాహిత్యం అందించిన కొన్ని ఆణి ముత్యాలు

తెలుగు సాహిత్యంలో  ప్రసిద్ధి చెందిన కొన్ని పదపల్లవాలు. ఇవి ఎల్లపుడు గుర్తుంచు కోవాలి. రాబోయే తరాలకు అందించాలి.

1. “తెలుగదేలయన్న దేశంబు తెలుగు
నేను తెలుగు వల్లభుండ…
దేశభాషలందు తెలుగు లెస్స”

-(శ్రీకృష్ణదేవరాయలు)

2. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’
-నన్నయ

3. ‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ_
ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’
-కాళోజి

4.‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు_
నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’
-దేవులపల్లి కృష్ణ శాస్త్రి

5. ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’
-సుబ్బారావు పాణిగ్రాహి

6. ‘రాజే కింకరుడగు_
కింకరుడే రాజగు’’_
-బలిజేపల్లి లక్ష్మీకాంతం

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న
వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’
-బసవరాజు అప్పారావు

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’
-గుర్రం జాషువా*

9. ‘అత్తవారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను’’
-కాళ్ళకూరినారాయణరావు

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’
-దాశరధి

11. ‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’
-నార్ల వెంకటేశ్వర రావు*

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’_
*తిరుపతి వెంకట కవులు*

13. ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’
-గురజాడ

14. ‘మాకొద్దీ తెల్ల దొరతనము’’
-గరిమెళ్ళ సత్యనారాయణ

15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’
-శ్రీనాథుడు

16. ‘ఇందు గలడందు లేడని సందేహము వలదు… ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’
-పోతన

17.2. ‘‘కప్పివుంచితే కవిత్వం
విప్పి చెబితే విమర్శ’’
-డా.సి.నారాయణరెడ్డి

18. ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’
-శ్రీ శ్రీ

19. ‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’
-వెన్నలకంటి

20. ‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’
-కొనకళ్ల వెంకటరత్నం*

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’
-అల్లసాని పెద్దన*

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’
-చేమకూరి వేంకటకవి*

23. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’
-త్యాగయ్య

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు……’’
-ధూర్జటి

25. “ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’
-బద్దెన

26. ‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’
-వేమన

27. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’
-కంచర్ల గోపన్న

28. ‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’
-సుద్దాల హనుమంతు

29. ‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’
-ఆరుద్ర

30. ‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’
-వేముల శ్రీ కృష్ణ

31. ‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’
-త్రిపురనేని రామస్వామి

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’
-బాలాంత్రపు రజనీ కాంతరావు

33 .‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’
-అడవి బాపిరాజు*

34. ‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
-కరుణశ్రీ

35. ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో
-గూడ అంజయ్య

36. ‘‘తను శవమై – ఒకరికి వశమై తనువు పుండై – ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై – ఎందరికో ఒయాసిస్సై’’
-అలిసెట్టి ప్రభాకర్

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’
-సావిత్రి

38. ‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’
-ఖాదర్ మొహియుద్దీన్

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను
-బాలగంగాధర తిలక్

40. ‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’
-అన్నమయ్య

41. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’
-ఏనుగు లక్ష్మణ కవి

42. అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ
-పాలగుమ్మి విశ్వనాథం

43. ‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ
-చలం

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
-విమల

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’
-నండూరి సుబ్బారావు

46. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’
-అందెశ్రీ

47. “చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

-చెరబండరాజు*

48. ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు

-కందుకూరి రామభద్రరావు

51.‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’
-గద్దర్

రానున్న తరానికి ఇవి మనం రాసిచ్చే అక్షర సంపద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *