పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద కాంగ్రెస్ నిరసన (ఫోటోలు)

పెట్రోలో డీజిల్  గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఈ రోజు ‘చలో రాజ్ భవన్’ నిర్వహించింది.  ఈ సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన సభ ఏర్పాటు చేశారు. ధరలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. గవర్నకు వినతి పత్రం సమర్పించేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాండిచ్ఛేరి వెళ్లారు. కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జండా తగిలించారు.

ఏఐసీసీ మరియు టీపీసీసి పిలుపు మేరకు ఈ రోజు నిర్వహిస్తున్న రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముట్టడికి యత్నించిన తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తర్వాత గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. జరిగింది.

ఇందిరా పార్క్  సభ దృశ్యాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *