ఆఫ్గనిస్తాన్ లో భారత ఫోటో జర్నలిస్టు హతం

భారతదేశానికి చెందిన ఫోటో జర్నలిస్టు దనిష్ సిద్దిఖీ ని కాందహార్ లో  తీవ్రవాదులు చంపేశారు. ఆయన వృత్తి మీద కాందహార్ ప్రాంతంలో ఉన్నారు. అయితే, ఆఫ్గన్ సైనికులలో బాగంగా (embedded) ఆయన ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. సిద్ధిఖీ పులిట్జర్ అవార్డు గ్రహీత కూడా. ఆఫ్గనిస్తాన్ టోలో న్యూస్ చానెల్ సమాచారం ప్రకారం ఆయనను  కాందహార్ రాష్ట్రంలోని స్పిన్ బోల్దాక్ జిల్లాలో చంపేశారు. ఈ చానెల్ అంతకుమించి వివరాలు అందించలేదు. సిద్ధిఖీ హత్య వార్తను భారతదేశంలోని ఆఫ్గన్ రాయబారి ఫారీద్  ముముంద్ జే ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు.

“గత రాత్రి నాకు మిత్రుడయిన సిద్ధిఖీని చంపేయడం కలచివేసింది. ఆయన పులిట్జర్ అవార్డు గ్రహీత. ఆయన ఆఫ్గన్ సేనలతో కలసి పనిచేస్తున్నారు.రెండు వారాల కిందట కాబూల్ వెళ్లే ముందు ఆయనను కలుసుకున్నాను. ఆయనకుటుంబానికి ప్రగాఢ సంతాపం,”అని రాయబారి ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *