ఎంతసేపు తెలంగాణ, రాయలసీమేనా, ప్రకాశం జిల్లా వద్దా?

ఇపుడు జరుగుతున్న కృష్ణా జలాల వివాదంలో ప్రకాశం జిల్లాని అంతా మర్చిపోతున్నారని ఆ జిల్లా నేతలు ఆవేదన చెందుతున్నారు. తమ జిల్లా నీళ్ల పరిస్థితి మీద ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి  టిడిపి ఎమ్మెల్యేలు  గొట్టిపాటి రవి కుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి,  ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. వివరాలు:

*శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ, రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం

★ కరువు జిల్లా గొంతు కోయొద్దని వేడుకుంటున్నాం

★ ప్రకాశం జిల్లా ను ఎడారిగా మారుతుందని కోరుకుంటున్నాం

★ పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్ పైనే ఆధారం

★ 15 ఏళ్లలో మూడు సంవత్సరాలు మాత్రమే సాధారణ వర్షపాతం.

★ ప్రకాశం జిల్లాలో మిగిలిన పన్నెండేళ్ళు కరువే

★ మీరు తీసుకున్న నిర్ణయాలతో మరింత చేటు చేసేలా ఉంది.

★ శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు సాగర్ నిండితేనే ప్రకాశం జిల్లాకు నీళ్లు

★ శ్రీశైలం నిండకుండా మీరు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే మా పరిస్థితి ఏమిటి

★ రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మా కరువు జిల్లా పరిస్థితి ఏమిటి..?

★ రాయలసీమ ఎత్తిపోతల 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కుల పెంపు పునరాలోచనను ఉపసంహరించుకోవాలి.

★ గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించి ప్రజల దాహార్తిని తీర్చే, పంటలకు సాగునీరు ఇవ్వాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *