ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారె

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఈ రోజు అత్యంత వైభవముగా ప్రారంభించబడినది.

ఈ ఉదయం  ఆలయ స్థానాచార్యుల వారు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక, అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించారు.

మహామండపం 6వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి, సుమారు రూ.3.30 లక్షల విలువజేయు బంగారు మయూరి హారమును శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *