జర్నలిస్టులకు ఆనందయ్య మందు పంపిణీ

ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) విజయవాడ కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో కృష్ణపట్నం ఆనందయ్య కోవిడ్ మందు జూలై 7 న (బుధవారం ఉదయం 11 గంటలకు) జర్నలిస్టులకోసం ప్రత్యేకంగా  పంపిణీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎండీ కరిముల్లా  సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

మాత్రమే ఈ మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆనందయ్య గారి మందు అవసరమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీ ఐడీ కార్డుతో మీ పేరు, ఫోన్ నెంబరు
ముందుగా నమోదు చేసుకున్న వారికి టోకెన్ ఇవ్వబడుతుంది.

సోమవారం ఉదయం నుంచి పేర్లు నమోదు (రిజిస్ట్రేషన్) జరుగుతుంది.ఆ టోకెన్ ఉన్న వారికి మాత్రమే ఆరోజు మందు పంపిణీ చేయబడుతుంది. ఒక్కో జర్నలిస్టుకు ఒక్క ప్యాకెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

కేవలం 300 మందికి మాత్రమే మందు అందుబాటులో ఉన్న కారణంగా ఈ టోకెన్ విధానం అమలు చేయడం జరిగిందనిఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *