తెలంగాణలో ఆర్టీసీ, మెట్రోరైల్ సర్వీసు వేళల పొడిగింపు

 

తెలంగాణలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించినందున  ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోలు రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు పొడిగిస్తున్నాయి. ప్రస్తుతం 3,600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతున్నాయి. వాటిని సాయంత్రం 6 వరకు నడుపుతారు.  సాయంత్రం 5గం. వరకు హైదరాబాదు సిటీ బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయి. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *