ఆంధ్రాకు సమృద్ధిగా ఆక్సిజన్ అందుతున్నాది…

రాబోయే రెండు మూడు రోజుల్లో కేంద్రప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలతో పాటు అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఆంధ్ర ప్రదేశ్ కు  రానున్నది. దీనితో రాష్ట్రంలో ఆక్సిజన్ విరివిగా అందుబాటులోకి వస్తుంది.

గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. చెన్నై లోని ఒక ప్లాంట్ లో ఇబ్బందుల రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోనుంది.ఈ మేరకు నిన్న అర్ధరాత్రి సమాచారమిచ్చారు.  వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమస్యను పరిష్కరించింది. ఈ విషయాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ వెల్లడించారు. కొద్ది సేపటి కిందట కోవిడ్ పరిస్థితి మీద మీడియాతో మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నది. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయి.. జామ్ నగర్ నుంచి మరో 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది. రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు వస్తుంది. జమ్ షెడ్ పూర్ నుంచి మరో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుంది. మొత్తం రెండు మూడు రోజుల్లో 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానున్నదని ఆయన చెప్పార.

కేంద్రమిచ్చే ఆక్సిజన్ తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్ ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో స్టోరేజ్ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన చెప్పారు.. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దూర్గాపూర్ నుంచి రానున్నాయని కూడా ఆయన చెప్పారు.

దీనివల్ల రాయలసీమ జిల్లాల ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జిలు

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని, ఇది శుభపరిణామమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.   గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి 4,306 మంది డిశ్ఛారయ్యారన్నారు. 5,523 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారని అన్నారు. అడ్మిషన్లు, డిశ్చార్జిల మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తోందని   రాబోయే రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జిలు మరింత పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 18,410 రెమిడెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేశామన్నారు.ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకే రోజు ప్రైవేటు ఆసుపత్రులకు 18 వేల కు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం ఇదే ప్రథమమన్నారు.

గత 24 గంటలలో 96 మంది మృతి

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 89,087 కరోనా టెస్టుల చేయగా, 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 96 మంది మృతి చెందారని తెలిపారు. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉందని, ఇది శుభపరిణామమని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే మరణాల శాతం తక్కువగా నమోదవుతోందన్నారు. రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లు ఉండగా 6,006 రోగులతో నిండి ఉన్నాయని, 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,204 బెడ్లకు గానూ 22,029 కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ శనివారం నుంచి జ్వరంతో బాధపడే వారిని  గుర్తించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు సింఘాల్ వెల్లడించారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేస్తారని. దీనివల్ల కరోనా కట్టడి చేయడమే గాక, ఆసుపత్రులపై ఒత్తిడి కూడా తగ్గునుందని ఆయన చెప్పారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *