రేపటి భారత్ బంద్ కు AP ఉద్యోగుల మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి26 వ తేదీన కిసాన్ సంయుక్త మోర్చ ఇచ్చిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఇదే విధంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేఖంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుతో  అదే రోజు సాగుతున్న బంద్ కు కూడా ఉద్యోగులు తెలిపారు.   భారత్ బంద్ కు 94 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో  ఉన్న AP JAC అమరావతి మద్దతు తెలియచేస్తున్నదని  ఈ సంస్థ  చైర్మన్ బొప్పరాజు సెక్రటరీ జనరల్ వైవీ రావులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక చట్టాలకు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా భారత్ బంద్ కు మద్దతు తెలియచేయటం శుభ పరిణామంగా భావిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *