చిత్తూరులో మళ్లీ కరొనా రెడ్ జోన్

కోవిడ్ వ్యాప్తి నివారించేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు మళ్లీ చర్యలు ముమ్మరం చేశారు. కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైన చోట్ల  మళ్లీ రెడ్ జోన్ విధిస్తున్నారు.

చిత్తూరు నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ చర్యలు మొదలయ్యాయి.

కొత్త కేసులు ప్రత్యక్షం కావడతో  వ్యాప్తి నివారణ  చర్యలు ప్రారంభించాలని  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  దీనితో నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ వైరస్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు.

ఈ రెండు విద్యా సంస్థల్లోనూ గురువారం ఉదయం సోడియం హైఫోక్లోరైట్ పిచికారి చేయించారు. వారం రోజుల పాటు పాఠశాల మూసి వేయాల్సిందిగా యాజమాన్యాలకు అదేశాలు జారీ చేశారు.

పాజిటివ్ గా గుర్తించబడిన విద్యార్థుల తరగతి గదిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు చిరునామాలను సేకరించి, వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల, కళాశాల వద్ద రెడ్ జోన్ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *