మిథాలి రాజ్ ఇక నుంచి 10 వేల పరుగుల రాణి

తెలుగు క్రీడాకారిని  మిథాలి రాజ్ (38) మహిళా క్రికెట్ లో  రికార్డు  సృష్టించింది.  ఈ రోజు సౌతాఫ్రికా తో అడిన మూడో వన్ డే  మ్యాచ్ తో ఆమె  10 వేల ఇంటర్నేషనల్ పరుగుల రికార్డు సృష్టించిన భారతీయ మహిళా క్రీడాకారిణి అయ్యారు. అంతర్జాతీయ ఈ రికార్డు సృష్టించిన రెండో మహిళా క్రికెడ్ క్రీకారిణి అయ్యారు. మొదటి మహిళ ఇంగ్లండుకు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్. ఆమె 309 మ్యాచ్ లలో 10,273 పరుగులు చేశారు.

ఈ రోజు సౌతాఫ్రికాతో ఆడిన  మ్యాచ్ లో ఆమె 36 పరుగులు చేశారు. దీనితో ఆమె వోవర్ ఆల్ స్కోర్ 10001 కి చేరింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *