మంగళవారం ఉదయం గుండాల దాడిలో గాయపడ్డ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.
పట్టాభిని ఆయన నివాసంలో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న సంఘవిద్రోహశక్తుల కార్యకలాపాల పట్ట ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ గూండాల దాడులను ప్రస్తావిస్తూ రౌడీలు, సంఘ విద్రోహ శక్తులకు ప్రజలు మద్దతు నీయడం మానుకోవాలని, అలా కాకపోతే రేపు మీకు మీ పిల్లలకు, ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, చట్టమనేది కొంతమంది చుట్టం కాదని, ఈ విషయాన్ని డీజీపీ, పోలీస్ వ్యవస్థ గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.
టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కలుస్తారని, మెమొరాండం ఇస్తారని దెబ్బలు తిన్న పట్టాభి కూడా ఈ బృందంలో ఉంటారని ఆయన వెల్లడించారు. మొదటి విడతలో మేమొరాండం ఇస్తారు. అపుడు పఠాభీ ముఖ్యమంత్రిని తన మీద జరిగిన దాడి గురించి ప్రశ్నిస్తారు. తన ప్రాణం కావాలా అని అడుగుతారు. అపుడు ముఖ్యమంత్రి ఏమంటారో చూద్దామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి స్పందన చూసి భవిష్యత్ కార్యాచారన నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు.