వర్షంలో తడవకుండా మువ్వన్నెల జెండాకు గొడగు పెట్టిన ప్రజలు

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్పేట్ లో  గురుద్వార వద్ద 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానికులు  జాతీయ పతాక ఆవిష్కరణ జరిపారు. ఆగస్టున 15 న పొద్దుటి నుంచి నగరమంతా ఎడతెరపి లేకుండా వర్షం వస్తున్నది. వర్షానికి జాతీయ పతాకం తడిసిపోవడ ఖాయం. ఇక్కడి స్వాతంత్య్ర పర్వదిన నిర్వహాకులు తమ ముచ్చటైన మువ్వన్నెల జండా వర్షంలో తడచిపోకుండా రెపరెపలాడాలనుకున్నారు.  దీనికోసం జాతీయ పతాకానికి గొడుగు ఏర్పాటు చేసి ఆవిష్కరించారు.
త్రివర్ణ పతాకం తడవకుండా గొడుగును ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో ఇదొక ప్రత్యేక ఆకర్షణ అయింది.