ఆంధ్ర కరోనా కేసులు లక్ష దాటాయి, మరణాలు వేయి దాటాయి

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసులు కొత్త మైలురాయి సృష్టించాయి. మొత్తం కేసులు ఈ  రొజుకు లక్ష దాటాయి.మరణాలు వేయి దాటాాయి.
గత 24 గంటలలో కొత్త 6051 కరోనాకేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు 102,349 కి చేరుకున్నాయి.  ఇలాగే 50 కొత్త మరణాలు రిపోర్టు కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 1090 కి చేరింది. నిన్న 43,127 శాంపిల్స పరీక్షించారు. రాష్ట్రంలో ఇంతవరకు 16,86,446 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి లీడ్ ఇంకా కొనసాగుతుంది. ఈ జిల్లా నుంచి గత 24 గంటలలోొ 1210 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న గుంటూరు జిల్లా నుంచి 744 కేసులు నమోదయ్యాయి.  ఇతర జిల్లాల వివరాలు ఇవే: