గల్లా జయదేవ్ అమరరాజా భూముల గొడవ, జగన్ ప్రభుత్వం ఉత్తర్వులపై స్టే

తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను  వెనక్కి తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.
ఈ భూములను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జివొ కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలను చిత్తూరు జిల్లా యడమర్రి, బంగారుపాళెం మండలాల్లో 2010 లో కేటాయించారు. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు సంబంధించింది. ఎకరా రు. 1.87 లక్షలకు నాటి ప్రభుత్వం కేటాయించించింది.
ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ (ఎపి ఐఐసి)కి ఉత్తర్వులిచ్చింది.  20 వేల మంది స్థానికులు ఉద్యోగాలిస్తూ ఈ భూములను వినియోగించకపోతే, ఎఫిఐఐసి వెనక్కి తీసుకోవచ్చన్న క్లాజ్ ను బట్టి ప్రభుత్వం ఈ ఉత్తర్వులిచ్చింది. అయితే, ఈ కంపెన 229.66ఎకరాలను మాత్రమే వినియోగించుకుంది. 253.61 ఎకరాలను వినియోగించుకోలేదు. అందుకే ఈ పేరుతో  ఈ భూములను వెనక్కి తీసుకోవాలనుకుంంది.
దీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.