త్వరలో పివి తపాలా బిళ్ల : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 02: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పివి నరసింహా రావు గారి ప్రత్యేక పోస్టల్ స్టాప్ ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించిందని   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. .
పివి నరసింహ రావు శత జయంతి ని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం తపాళ బిళ్లను విడుదల చేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తాను చేసిన విజ్ఞప్తి ఆమోదించారని చెబుతూ ఇది తెలుగు ప్రజలందరికి హర్షదాయకమని కిిషన్ రెడ్డి అన్నారు.
ఇందుకు ప్రధాని శ నరేంద్ర మోదీ, కేంద్ర సమాచార శాఖ, ఐ&టి శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పివి దూర దృష్టి, సంస్కరణలు, సౌత్ ఈస్ట్ ఆసియాతో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేశాయన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితగా పివి నరసింహరావు ని అభివర్ణించారు. పివి చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలపాలన్న యోచనతోనే పివి పోస్టల్ స్టాంప్ విషయంలో చొరవ చూపినట్లు పేర్కొన్నారు. త్వరలో భారత ప్రభుత్వం పివి పోస్టల్ స్టాంప్ ను విడుదల చేస్తుందని చెప్పారు. ఇది దేశానికి పివి చేసిన సేవలను గుర్తిస్తూ, గౌరవ చిహ్నంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు  కిషన్ రెడ్డి పేర్కొన్నారు.