తెలంగాణలో ఈ రోజు 1213 కొత్త కరోనా కేసులు, మృతులు 8

తెలంగాణాలో ఈ రోజు కరోనా కేసులు రికార్డు సృష్టించాయి. గత ఇరవై నాలుగు గంటలలో 1213 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,570 కి చేరుకుంది. గత 24 గంటలలో మృతిచెందిన వారు 8 మంది. దీనితో మొత్తం తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 275 కు చేరింది.రాష్ట్రంలో  యాక్టివ్ కేసులు 9,226. ఇంతవరకు డిశ్చార్జ్ అయిన వారు 9069.  ఈ రోజు 987 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ ఒక బులెటీన్ విడుదల చేసింది. ఈరోజు నమోదయి కేసులలో అత్యధికంగా 998 కేసులు ఒక్క జిహెచ్ ఎంపిలోనే ఉన్నాయి. తర్వాత స్థానం  55కేసులతో మేడ్చల్ జిల్లాది కాతా, 48కేసులతో రంగారెడ్డి మూడో స్థానంలోఉంది. జిల్లాల వారీగా ఈరోజు నమోదయిన కేసుల వివరాలు: