కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరితమని ప్రకటించిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు మీద నిప్పులు చెరిగారు ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క.
ఆమె ఏమన్నారంటే…
ఆదివాసీలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ నే.
కేసీఆర్ ఆశలకు నమ్మి ఆత్రం సక్కు ,రేగా కాంతారావు అమ్ముడుపోయారు.
అమ్ముడుపోయిన ఆ ఇద్దరు ..కేసీఆర్ న్యాయం చేస్తారనడం జాతి క్షమించదు.
కేసీఆర్ ,మోడీ తీరుతో గిరిజనులను అడవికి దూరం చేస్తున్నారు.
భూములు లాక్కుంటే ..ఆ ఇద్దరు కేసీఆర్ సమర్ధించడం సిగ్గుచేటు.
రేపు కేంద్రం లో కాంగ్రెస్ వస్తే ..కేసీఆర్ ఎంపిలను కాంగ్రెస్ లో చేర్చుతారా ..?
ప్రతిపక్షం ఉండకూడదు అనుకోవడం దారుణం .. ప్రజలు సహించరు.
ఆత్రం సక్కు ,రేగలు పురాలోచించుకోవాలి ..
అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ..కేసీఆర్ గుర్తుంచుకోవాలి