ఆంధ్రా లాక్ డౌన్ పొడిగింపు, కొత్త మార్గదర్శకాలు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు అధికారికం ప్రకటన చేసింది. దీనికి తగ్గట్టుగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి ఈ జూన్ 8 నుంచి అమలులోకి వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పరిస్థితులు మిగతా రాష్ట్రాలతో పోల్చితే కాస్త ఫర్వాలేదని అందువల్ల లాక్ డౌన్ నియమాలను మరింత సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది.
కొత్తగా దేవాలయాలు పునఃప్రారంభిస్తుండడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుస్తుండడంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబంధనలతో కూడిన కొత్త జాబితాను ప్రభుత్వం
ఇవాళ విడుదల చేసింది.
.తాజా మార్గదర్శకాలు
కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమల్లో ఉంటాయి.
రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకోవచ్చు.
అయితే, ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు చేసుకోవాలి.
తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం పట్ల నిషేధం.
అన్నదానం నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి.
ఆలయాల్లో క్యూ లైన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి.
కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవచ్చు. (హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ తీసుకెళ్లేందుకే అధిక ప్రాధాన్యత)
షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి.
డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈ-వాలెట్ సౌకర్యం కల్పించాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా పాటించాలి.