జగన్ ప్రభుత్వంలో తొలి నిరసన ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  తొలిసారిగా నిర‌స‌న సెగ త‌గిలింది.  తాడే పల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌సాయం దాని అనుబంధ విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంలోనే 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఏఎన్ఎంలు సీఎం క్యాంపు కార్యాల‌యం ముందు ఆందోళనకు దిగారు. అయితే, ఇది జగన్  మీద ఎక్కుపెట్టిన నిరసన కాదు, గత ప్రభుత్వంలో మోసపోయిన బాధితుల ఆక్రందన.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వీరు వాపోయారు.
కొత్త ప్రభుత్వమయినా తమకు న్యాయం చేయాలని కోరారు. వీరి ఆందోళనను క్యాంపు ఆఫీసు అధికారులెవరూ పట్టించుకోలేదు. ఆందోళనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు..