యూనియన్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు తల్లి, మహారాష్ట్ర బిజెపి నాయకురాలు చంద్రకాంత గోయల్ ముంబై లో మరణించారు.
వృద్ధాప్యం వల్ల, ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు.
ముంబైకార్పొరేటర్ గా ఆమె ఎమర్జన్సీ తర్వాత రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత ముంబై మాతుంగ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మూడుసార్లు ఎంపికయ్యారు.ఆమె భర్త వేద ప్రకాశ్ గోయల్ చాలా కాలం భారతీయ జనతా పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. అంతేకాద, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన షిప్పింగ్ మంత్రిగా కూడా ఉన్నారు.
ఆమె మృతి గురించి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఆమె జీవితాంతం ప్రజలకోసం పనిచేశారని, ఎంతో స్ఫూర్తిగా నిలబడ్డారని గోయల్ చెప్పారు.
अपने स्नेह, और प्रेम से मुझे हमेशा राह दिखाने वाली मेरी पूज्य माता जी का आज सुबह स्वर्गवास हो गया।
उन्होंने अपना पूरा जीवन सेवा करते हुए बिताया, और हमें भी सेवाभाव से जीवन बिताने को प्रेरित किया। ईश्वर उन्हें अपने श्री चरणों मे स्थान दें। ॐ शांतिः pic.twitter.com/mwlIks6TBJ
— Piyush Goyal (@PiyushGoyal) June 6, 2020