ఓబీసీ పార్లమెంట్ కమిటీతో HCU బీసీ అసోసియేషన్ల చర్చలు

 

సుమారు 30 పార్లమెంటు సభ్యులతో   వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సంక్షేమం కొరకు ఏర్పాటు చేయబడిన పార్లమెంట్ కమిటీ తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ లు సుమారు 30 బీసీ సమస్యలు మరియు అంశాల మీద విజ్ఞప్తి పత్రాలను చర్చించి సమర్పించారు.

పార్లమెంట్ కమిటీ చైర్పర్సన్ శ్రీ రాజేష్ వర్మ గారిని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మరియు ఇతర సభ్యుల్ని యూనివర్సిటీ హైదరాబాద్ ఓ బి సి ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఈ వెంకటేశు, అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గేష్ సింగ్ మరియు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కేతన్ జాతీయ కార్యదర్శి సాయికిరణ్ కలిశారు.

పూలే పేరు మీద దేశవ్యాప్తంగా మరియు యూనివర్సిటీ హైదరాబాద్ లో బీసీ సమస్యల మీద పరిశోధన కేంద్రాలను పెట్టాలని, రోస్టర్ ను తూచా తప్పకుండా పాటించాలని, ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కేడర్లలో 27% రిజర్వేషన్లను తూచా తప్పకుండా పాటించాలని బీసీ విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిపులను 5 వేలకు పెంచాలని, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ లో రిజర్వేషన్లను పాటించాలని మరియు ఎంప్లాయ్ క్వార్టర్స్ లొకేషన్ లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.

యూనివర్సిటీల ఉపకులపతుల నియామకంలో జాతీయస్థాయి కమిటీలలో బీసీలను జనాభా ప్రాతిపదికన నియమించాలని యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ వారు పరిశోధన కోసం ఇచ్చే ఆర్థిక నిధులలో 27% ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *