నేటి నుంచి ఇంద్రకీలాద్రి శాకాంబరీ ఉత్సవాలు

 

*విజయవాడ, ఇంద్రకీలాద్రి, : ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో సోమవారం నుంచి మూడురోజుల పాటు శాకాంబరీ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటీవ్‌ అధికారి భ్రమరాంబ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13 వరకు నిర్వహించే శాకాంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 12 టన్నుల తాజా పండ్లు , కూరగాయలతో అలంకరించనున్నామని ఆమె వివరించారు.

ఈ సీజన్‌లో సుమారు లక్ష మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. శాకంబరీ ఉత్సవాల ప్రారంభం రోజున విఘ్నేశ్వర పూజ, రుత్విక్‌ వరుణ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, కలశ స్థాపన లాంటి పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు.

శాకంబరీని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి, ప్రధానంగా వర్షాలు కురుస్తాయని భక్తులు విశ్వసిస్తారని ఆలయ పండిట్ శివప్రసాద శర్మ స్థాన ఆచార్య  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *