అన్ని జిల్లాలలో బిజెపి ఆఫీస్ ల నిర్మాణం

*కర్నూలులో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఒక కోటి రూపాయలు విరాళం..ఎంపీ టీజీ వెంకటేష్.

* ఘనంగా జరిగిన బీజేపీ కార్యాలయ భూమి పూజ.

కర్నూలు,మే 11:

ఇక్కడి సంతోష్ నగర్ నేషనల్ హైవే సమీపంలో  భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను సభ్యులు టీజీ వెంకటేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంయుక్తంగా భూమిపూజ చేసి ప్రారంభించారు.

బిజెపి కార్యాలయం నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించగా, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, అంబాల ప్రభాకర్ రెడ్డి, స్థల దాతలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నగరూరు శమంతకమణి, రాఘవేంద్ర, హిమబిందు, బాల సాయి ట్రస్ట్ ప్రతినిధి రామారావు తదితరులు పాల్గొన్నారు .

కార్యాలయ నిర్మాణానికి 32 సెంట్ల స్థలాన్ని విష్ణు కన్స్ట్రక్షన్స్ అధినేత రాఘవేంద్రజ , మరో 18 సెంట్ల స్థలాన్ని బాల సాయి ట్రస్ట్ ప్రతినిధి రామారావు బిజెపి  విరాళంగా ఇవ్వడం విశేషం.

ఇలాగే కర్నూలు  కార్యాలయం నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు.

అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు  కార్యాలయాన్ని సంవత్సరంలో గా పూర్తి చేసి పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తామని వివరించారు.

మొత్తం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బిజెపి కార్యాలయం నిర్మాణానికి రాష్ట్ర కమిటీ అవసరమైన చర్యలు తీసుకుందని వివరించారు. ఏడాదిన్నర లోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిజెపి కార్యాలయాలను నిర్మించనున్నట్లు చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *