3 TIMS కు రేపే శంఖుస్థాపన

 

*ఢిల్లీలో ఎయిమ్స్ తరహాలో Tims ఆసుపత్రులు

*ఈ నెల 26న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

*నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది.

*తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది.

*కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్‌ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి.

*ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ దవాఖాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్‌ మహా నగరం వేదిక కాబోతున్నది.

*ఆసుపత్రుల వివరాలు…..

* ఒక్కో దవాఖానను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
* ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తారు.
* వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
* అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

1) అల్వాల్
మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలు
ఎత్తు: జీ+5
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.897 కోట్లు

2) ఎల్బీనగర్
మొత్తం విస్తీర్ణం: 21.36 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.900 కోట్లు

3) సనత్ నగర్..
మొత్తం విస్తీర్ణం: 17 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.882 కోట్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *