వైఎస్ షర్మిల రైతు గోస ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రధాన రహదారి పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు రైతు గోస ధర్నాలో కూర్చున్నారు. హామీలను నెరవేర్చమని టీఆరెస్ నేతలు వస్తే కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆమె ప్రజలకు పిలుపు ఇచ్చారు.

 వై ఎస్ షర్మిల  రైతు గోస ధర్నా
వై ఎస్ షర్మిల రైతు గోస ధర్నా

ఆక్కడ ఆమె ఇంకా  ఏమన్నారంటే…

“మనం ఈ దేశం లోనే భాగంగా ఉన్నామా. లేక పాకిస్థాన్ ,ఆఫ్ఘనిస్తాన్ లో భాగం గా ఉన్నామా ప్రజల కష్టాలు చూస్తుంటే ఎక్కడ ఉన్నామో అర్దం కావడం లేదు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పోడు భూములకు పట్టాలు దక్కేవి. ఈ పాలకులకు ఎస్సీ లు,ఆదివాసీలు మనుషులుగా కనిపించడం లేదు. మా భూములు మాకు ఇవ్వని నెత్తి నోరు బాదుకుంటున్నారు. పట్టాలు ఇవ్వక పోగా ఉన్న భూములు లాక్కుంటారా. ఎన్నికలప్పుడు పోడు భూముల సమస్య ఉందని కేసీఆర్ చెప్పలేదా. కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కారం అని చెప్పలేదా. ఎందుకు రాలేదు మరి కేసీఆర్.  కేసీఆర్ కి చేత కావడం లేదా. హక్కులు అడిగితే జుట్టు పట్టుకొని లాక్కెళ్తారా.నష్ట పోయిన కుటుంబాలకు ఎం సమాధానం చెప్తారు. మీరు వాగ్దానం ఎందుకు చేశారు. ఇప్పుడు చేస్తుంది ఏమిటి.  6లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే లాక్కోవడం దారుణం.దళితులకు 10 లక్షలు ఇస్తామని ఇచ్చారా. 3 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం 51 లక్షలు. భూమి ఇవ్వండి లేకుంటే 10లక్షలు కలిపి 61 లక్షలు ఇవ్వండి.టీఆర్ఎస్ నేతలు వేస్తే కాలర్ పట్టుకొని అడగండి.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *