తెలంగాణలో ఎండలు మండుతాయ్, జాగ్రత్త!

*రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి: సి.ఎస్. సోమేశ్ కుమార్

హైదరాబాద్, మార్చి 30 ::రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

పాఠశాల వేళల్లో మార్పులు చేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ,ఆరు రోజుల పాటు అనగా 31మార్చి నుండి ఏప్రిల్ 6వరకు ఉదయం 8 నుండి 11.30 వరకు పాఠశాలలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమీషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *