బెజవాడ ఆసుపత్రి ముందు మురుగు కాలువ

ఈ దృశ్యాన్ని తిలకించండి. దీన్ని ఈ రోజు “మార్నింగ్ వాక్”కు వెళ్ళినప్పుడు తీశాను. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర ఉన్న మురుగు కాలువ ఇది.

డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి విజయవాడకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చిందని నాలుగేళ్ళ నుంచి చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో మరి?

ఇక్కడే సిద్ధార్థ వైద్య కళాశాల ఉంది. వైద్య కళాశాలలో బోధించే వైద్య నిపుణులు, బోధనాస్పత్రిగా ఉన్న సర్వజన ఆసుపత్రిలో వైద్యం అందించే వైద్య నిపుణులు అక్కడ వృద్ధి చెందుతున్న దోమలతో సహజీవనం చేస్తున్నారు!

ఆసుపత్రికి చికిత్స కోసం ప్రతి రోజూ వచ్చే వందలాది రోగులు దోమకాటుతో, కాలుష్యంతో కొత్త జబ్బులతో ఇళ్ళకెళుతుంటారు!

 

రాష్ట్ర ప్రభుత్వానికి, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కు, వైద్య ఆరోగ్య శాఖకు, ఎవరికీ ఈ సమస్య పట్టినట్లులేదు!

డ్రైనేజీ పన్ను, చెత్త పన్ను, ఆస్తి పన్ను, వగైరా పన్నులను మాత్రం పెంచుకొంటూ పోతున్నారు. ప్రజల నుండి గోళ్లు ఊడగొట్టి వసూలు చేసుకొంటున్నారు.

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్టదా!

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *