దేశంలో పెట్రోలు, డిజిల్ ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. ఈట్రెండ్ చూస్తే కొత్త సంవత్సంరలో పెట్రోలు ధర లీటర్ రు.150అవుతందేమో అనిపిస్తుంది.
ముంబాయిలో పెట్రోలు ధర దేశంలో అత్యధికంగా ఉంది. ఈ రోజు 29 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోలు ధర 110.12 పైసలకు పెరిగింది. డీజిల్ ధర 37 పైసలు పెరిగి, రు.100.66 పైసలకు పెరిగింది.
జూన్ 10న దేశంలో తొలిసారి పెట్రోలు ధర రు.100 దాటింది.అప్పటి నుంచి ఇప్పటి దాకా పది రుపాయలు పెరిగింది.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82 డాలర్ల కు చేరడంతో ధరలు పెరగడం మొదలయింది. ఆయల్ ఉత్పత్తి చేసే దేశాలు (OPEC) పెట్రోలియం ఉత్పత్తిని రోజుకు 0.4 మిలియన్ బారెల్స్ మించి ఉత్పత్తి చేయకూడదని నిర్ణయించడంతో ధరలు పెరుగుతున్నాయి. ఒక నెల కిందట బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 72 డాలర్లే ఉండింది. భారతదేశం ఆయిల్ కోసం దిగుమతుల మీద ఆధారపడాల్సి ఉండటంతో క్రూడ్ ధరల భారత దేశం ప్రజలందరి మీద పడుతూ ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా రోజుకు 4 లక్షల డాలర్లు మించి ఉత్పత్తి చేయరాదని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. క్రమంగా ఇపుడున్న 5.8 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తిని 4 లక్షలకు కుదించేశాయి. డిమాండ్ విపరీతంగా ప్రొడక్షన్ తగ్గిపోయింది. దీనితో క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగాయని రాయిటర్స్ (Reuters) రాసింది. లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి గురించి ఒపెక్ దేశాల మధ్య జూలై నెలలో ఒప్పందం కుదిరింది. వచ్చే ఏప్రిల్ దాకా దీనికి కట్టుబడే ఉంటాయి.ఈ ఏడాది ఇప్పటిదాకా ఆయిల్ ధరలు 50 శాతం పెరిగాయి.
ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14/ltr(రూ.0.30 పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 92.82/ltr(రూ.0.35 పెరిగింది).
ముంబైలో పెట్రోల్ రూ. 110.12/ltr (రూ.0.29పెరిగింది), డీజిల్ రూ .100.66/ltr(రూ.0.37 పెరిగింది)
కోల్కతాలో పెట్రోల్ రూ. 104.80/ltr (రూ.0.28 పెరిగింది) & డీజిల్ రూ. 95.93/ltr(రూ.0.35 పెరిగింది)
చెన్నైలో పెట్రోల్ రూ .101.53/ltr(రూ.0.26 పెరిగింది)& డీజిల్ రూ. 97.26/ltr(రూ.0.33 పెరిగింది)
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108.33(రూ.0.31 పెరిగింది), డీజిల్ లీటర్ రూ.101.27(రూ.0.38 పెరిగింది).