అసెంబ్లీలో పివి చిత్ర పటావిష్కరణ

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా  శుక్రవారం అసెంబ్లీ లాంజ్ లో పీవీ తైలవర్ణ చిత్రపటాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోసీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, కమిటీ సభ్యులు, శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పీవీ కూతురు వాణి దేవి, పీవీ కుటుంబ సభ్యులు, కెవి రమణాచారి, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *