ఢిల్లీకి అఖిల పక్ష యాత్ర: కెసిఆర్ ప్రకటన

నదీజలాల విషయంలో ప్రాజక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభత్వం విడుదల చేసిన  గెజిట్ నోటిఫికేషన్ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.

ఈ రోజు అసెంబ్లీ వానకాల సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ హామీ ఇచ్చారు.  నదీజలాలవివాదంలో ముఖ్యమంత్రి అన్నిపక్షాలను కలుపుకుని ఢిల్లీ వెళ్లాలని ప్రతిపక్షాలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు కెసిఆర్ దీనికి అంగీకరించారు.

శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. గత నెల 24 నుంచి 8వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.

మొత్తంగా 7 రోజుల పాటు సభ జరిగింది .  27 ప్రశ్నలకు సమాధానం సభ ఇచ్చింది.  37 గంటల 5 నిమిషాలు సభ జరిగింది.  7 బిల్లులు చర్చకు వచ్చాయి. 6 అంశాల మీద లఘు చర్చలు జరిపారు.  బిసి కులాల జనగణన పై అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *