నల్ల కండువాలతో ఈ రోజు బండి పాదయాత్ర

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అమలుచేయనందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  తన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ని ఈ రోజు నల్ల కండువాలు ధరించి  నిరసన పాదయాత్రగా మార్చారు. ఆయన వెంబడి నల్ల కండువాలు ధరించి వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా నిరసన తెలిపారు.

‘‘ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే-నిరుద్యోగ భ్రుతి ఏమాయే’’ అని వారు ప్రశ్నించారు.

ఇంటికొక ఉద్యోగం ఇస్తనంటివి, నువ్వేమో నీ ఇంటికి ఐదు ఉద్యోగాలు తీసుకుంటివి అనే పోస్టర్ను ప్రదర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఐకేపీ సెంటర్ వద్ద పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి బండి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *