తెలంగాణ ఉద్యోగాల మీద శ్వేత పత్రం: బండి డిమాండ్

ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై  శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్, తన కుటుంబం, వారి బంధువులకు డజను ఉద్యోగాలిచ్చారని బండి సంజయ్ అన్నారు.

నిరుద్యోగ భ్రుతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి రూ.లక్ష బకాయి పడ్డారని,

నిరుద్యోగ భ్రుతి కింద ఇవ్వాల్సిన రూ.లక్షను నిరుద్యోగ యువతీయువకులు వెంటనే అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *