వినాయక ఉత్సవాలకు అమరావతి హైకోర్టు అనుమతి

అమరావతి: వినాయక చవితి ఉత్సవాలకు హై కోర్టు అనుమతించింది. ఉత్సవాల నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

అయితే ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని  హైకోర్టు చెప్పింది.

మత పరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వాలకు ఉండదని   హైకోర్టు చెప్పింది.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించ కుండా పూజలు చేసుకోవాలని కోర్టు చెప్పింది.

పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెటీ ఉత్సవాలు నిర్వహించడంపై  హైకోర్టు అభ్యంతరం చెప్పింది.

ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది.

ప్రైవేటు స్థలాల వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోన పేరుతో  రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను నిషేధించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆదేశాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని స్పష్టం చేసిన హైకోర్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *