దానం, తలసాని టిఆర్ ఎస్ జండా పండగ…

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా KCR నాయకత్వంలో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమిగి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు.

సోమాజిగూడ లో పార్టీ ఎమ్మెల్యే  దానం నాగేందర్  ఈ రోజు  టిఆర్ ఎస్ జండా పండగ నిర్వహించారు. జెండా పండుగ కార్యక్రమంలో  మంత్రి తలసాని కూడా పాల్గొన్నారు.

స్వయం పాలన రావాలి..అప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ముందే గుర్తించిన నాటి ఉద్యమకారుడు కెసిఆర్ అని కొనియాడారు.    నేడు ముఖ్యమంత్రి గా ఆయన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నారని అన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో  పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం  ఆయన రూపొందించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.  టిఆర్ ఎస్  పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, టిఆర్ ఎస్ పార్టీ ని  తమ పార్టీ గా ప్రజలు భావించి ఆదరిస్తున్నారని వారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *