28న పెట్రోలు ధరల మీద టిడిపి నిరసన

.

28-08-21 తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెంపుపై  నిరసన కార్యక్రమం నిర్వహించలాని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది.

ఇదే విధంగా  ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో జరుగుతున్న జప్యానికి కూడా టిడిపి నిరసన తెలుపుతుంది.

ఈ పథకానికి రూ.413 కోట్లు డిపాజిట్  చేశామని చెబుతున్నా అవి కాంట్రాక్టర్లకు అందలేదు. కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారిమళ్లించడాన్ని, కోర్టు ధిక్కరణకు పాల్పడటమే పార్టీ పేర్కొంది

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  ఈ రోజు ప్రజాసమస్యల మీద  ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని కుదిపేస్తునన అనేక సమస్యలను చర్చించారు. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో చర్చించిన మరిన్ని సమస్యలు

*. దళితురాలైన రమ్య హత్య కేసు విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్రానికి రానుంది. ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ తరపున అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది.

*. అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలి. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదు.

*. దశలవారీ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారు. నాసిరకం మద్యంతో పాటు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

*. కోవిడ్ నియంత్రణలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. ఇతర రాష్ట్రాలు బాధితులకు ప్యాకేజీ ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. కేంద్ర నిధులు, వ్యాక్సిన్ తోనే మమ అనిపించారు. కరోనాలోనూ పన్నులు, ధరలు పెంచి వేలకోట్లు భారాలు ప్రజలపై మోపారు. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన దానికన్నా ప్రజలపై మోపిన భారాలు రెట్టింపుగా ఉన్నవి. తెచ్చిన రూ.2 లక్షల కోట్ల అప్పు ఏమి చేశారు? అవినీతి, దుబారా వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది.

*. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, సాయం అందడం లేదు. జనాభా ప్రాతిపదికన వీరి సంక్షేమానికి నిధులు కేటాయించాలి. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించివేస్తున్నారని, ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

*. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జగన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందారు. జగన్ రెడ్డి మోసాలను రెండేళ్లలోనే ప్రజలు గ్రహించారని, నీలి మీడియా అబద్ధాల ప్రచారం నుంచి ప్రజలు బయటపడుతున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్,  కె.అచ్చెన్నాయుడు,యనమల రామకృష్ణుడు, శ్రీ వర్ల రామయ్య,  కాలవ శ్రీనివాసులు,  నిమ్మల రామానాయుడు,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మకాయల చినరాజప్ప,  పయ్యావుల కేశవ్,  టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు,  బండారు సత్యనారాయణ మూర్తి, బోండా ఉమా మహేశ్వరరావు,  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,  ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం,  బీసీ జనార్థన్ రెడ్డి,  మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *