రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసుల మృతి

పలాస : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మదేవి రైల్వే గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కలకత్తాలో మరణించిన ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. లారీ బొలెరో ఢీ కొన్నట్లు చెవుతున్నారు.

పలువురు గాయపడ్డారు సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *