టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ ఫోటోలు…

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో తితిదే ఈవో జవహర్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

గతంలో 2019లో తితిదే ఛైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి ఈ ఏడాది జూన్‌ 22 వరకు కొనసాగారు.

రెండో సారి మళ్లీ ఆయననే ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే తితిదే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *